గజ్వేల్‌లో ఘోర ప్రమాదం.. బొలేరోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

by  |
gajwel
X

దిశ, గజ్వేల్ : ఆర్టీసీ బస్సు.. బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ములుగు మండలంలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్ యాడ్ వద్ద రాజీవ్ రహదారిపై ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది.

ములుగు ఎస్‌ఐ రంగ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బొలెరో వాహనంలో డ్రైవర్ నర్సింహారెడ్డి తన భార్య పిల్లలతో కలిసి బోనాల పండుగకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంతో డివైడర్‌ను ఢీ కొట్టి డివైడర్‌ను దాటి బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న నరసింహా రెడ్డి కుటుంబానికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.


Next Story

Most Viewed