రైతుబీమాకు రూ.800 కోట్లు విడుదల

by  |
agricultural insurance
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది రైతుబీమాకు రూ.800 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి కావల్సిన నిధులను సమకూర్చామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఏ కారణం చేతనైనా రైతులు చనిపోతే అతని కుటుంభ సభ్యులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా రూ.5లక్షలను అందిస్తుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం లబ్ధిదారుల ఖాతాలో 10 రోజుల్లోపు ఇన్సూరెన్స్ డబ్బులు ఖాతాలో జమవుతాయని వివరించారు.


Next Story

Most Viewed