- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఫీచర్స్ : ఏ వస్తువుకైనా మార్కెట్లో డిమాండ్ పెరిగిందంటే, ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. నిత్యావసరాల విషయంలో ఎక్కువగా ఈ పరిస్థితిని చూస్తుంటాం. కాగా ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. డెంగ్యూ ఫీవర్ వల్ల ఆ రాష్ట్రంలోని ఓ జిల్లాలో వందలమంది చనిపోవడంతో మేక పాల ధరకు రెక్కలొచ్చాయి. ఈ పాలకు సాధారణంగా లీటరుకు రూ.50/- ఉంటుండగా.. ప్రస్తుతం రూ.1500/-కు పైగా విక్రయిస్తుండటం గమనార్హం.
ప్లేట్లెట్స్ పెరుగుతాయని..
మేక పాలు తాగితే ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుందనే అపోహలు ప్రచారమవుతుండటంతో గిరాకీ అమాంతం పెరిగింది. కాగా ఈ పరిస్థితిని వివరించిన ఫిరోజాబాద్కు చెందిన ఓ పాల విక్రయదారుడు.. ‘గత నెల డెంగ్యూ వ్యాప్తి చెందినప్పటి నుంచి చాలామంది మేక పాల కోసం నా దగ్గరకు వస్తున్నారు. మొదట లీటరు రూ.50కే విక్రయించినా, ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో రూ.1500 తీసుకుంటున్నా’ అని తెలిపాడు. అయితే డెంగ్యూను తగ్గించడానికి మేకపాలు సాయపడతాయని స్థానిక ఆయుర్వేద డాక్టర్ సూచించాడని స్థానికులు చెబుతుండగా.. శాస్త్రీయంగా మాత్రం రుజువు కాలేదు.