- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ముంబయి : ట్రాఫిక్ ఉల్లంఘనలకు పోలీసులు చలానాలు పంపుతారు. హెల్మెట్ ధరించకుంటేనో, సీటు బెల్టు పెట్టుకోకుంటేనో సాధారణంగా ఉల్లంఘనులకు చలానాలు జారీ అవుతాయి. కానీ, మహారాష్ట్రలో మహమ్మారి కేసులు మళ్లీ భారీగా నమోదవుతున్న వేళ ముంబయి పోలీసులు కరోనా నిబంధనల ఉల్లంఘిస్తున్నవారిపై కొరడా ఝుళిపేందుకు సిద్ధమయ్యారు. ఇకపై పబ్లిక్ ప్లేసుల్లో మాస్కు ధరించకున్నా చలానా విధించనున్నారు. ఇప్పటి వరకు హెల్మెట్, సీటు బెల్టు ధరించనివారికి భద్రతను, ప్రాణాల విలువను గుర్తించాలని చలానాలు విధించే వారమని, ఇకపై అదే కారణంతో మాస్కులు ధరించకుంటే కూడా చలానాలు జారీ చేస్తామని తెలిపారు. హెల్మెట్ ధరించకుంటే రూ. 500, సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ. 500లు, మాస్కు లేకుంటే రూ. 200ల ఫైన్ విధిస్తామని ముంబయి పోలీస్ ట్వీట్ చేసింది.
Next Story