ఎకరాకు రూ.18 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి

by  |
ఎకరాకు రూ.18 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి
X

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోతున్న బీఎన్ తిమ్మాపూర్ రైతులకు ఎకరాకు రూ.18 లక్షలు పరిహారం ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌ను కలిశారు. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లతరాజు, మాజీ ఎంపీటీసీ జిన్న మల్లేశ్, శ్రీశైలం, గణేష్, బాలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Next Story