బోనాలకు సిద్ధమవుతోన్న హైదరాబాద్.. రూ.15కోట్లు రిలీజ్

by  |
bonalu-july-11th
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఆషాడమాసంలో నిర్వహించే బోనాలు చాలా ప్రసిద్ధి గాంచినవి. ప్రతీఏడాది బోనాలను రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, గతేడాది కరోనా కారణంగా బోనాలను ఘనంగా నిర్వహించడం సాధ్యపడలేదు. ఈ క్రమంలోనే ఈసారి బోనాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అందుకోసం రూ.15 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది.

రాష్ట్రంలో మొదటి బోనాలు జులై 11న గోల్గొండలో జరగనుండగా, జులై 25న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగనున్నాయి. ఇదిలాఉండగా, కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టనందున ఈసారి కూడా కొవిడ్ ఆంక్షల మధ్యే బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed