- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, శేరిలింగంపల్లి: కరోనా కష్టకాలం నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి సెక్టార్ థెరపీయూటిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.15 లక్షలు విరాళంగా అందజేసింది. ఇందుకు సంబంధించిన చెక్ను ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీతో కలిసి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ పంచాంగుల రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖమంత్రి కేటీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్న సేవలపై స్వచ్చంద సంస్థలకు, ప్రైవేట్ సంస్థలు స్పందించి తమవంతు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు.
సీఎంఆర్ ఎఫ్ ద్వారా ఎంతోమంది పేదవారికి సహాయం అందించడం జరుగుతుందని, సామాజిక దృక్పథంతో సమాజ సేవ చేయడానికి ప్రతిఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయిబాబ, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.