స్విమ్మింగ్‌ పూల్‌లో ఐపీఎల్ జట్టు

by  |
స్విమ్మింగ్‌ పూల్‌లో ఐపీఎల్ జట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 13 రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కలిసొచ్చింది. ప్రతీ సీజన్‌లో తడబడే జట్టు ఈసారి విజయాలతో దూసుకెళ్తూ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. మొత్తం 11 మ్యాచుల్లో ఏడింట్లో విజయం సాధించి.. నాలుగు పరాజయాలు నమోదు చేసింది. దీంతో ప్లే ఆఫ్స్‌ చింత లేకుండా పోయింది. ఇక ఈ క్రమంలోనే ఆర్సీబీ జట్టు ఆటగాళ్లు దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాచ్‌ల్లో రాణిస్తూ.. వ్యక్తిగత ఉల్లాసంలో మునిగితేలుతున్నారు. దుబాయ్‌లోని ఓ హాటల్‌లో సేద తీరుతున్న ఆర్సీబీ జట్టు మొత్తం ఒక్కసారిగా స్విమ్మింగ్‌ పూల్‌లో ప్రత్యక్షమయ్యారు. వాటర్ వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఈ సన్నివేశాలను ఆర్సీబీ అధికారికంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed