విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

by  |
విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో భాగంగా గురువారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఘన విజయం సాధిచింది. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఆర్సీబీ తరపున 200 టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా విరాట్ కొహ్లీ రికార్డు సృష్టించాడు.

ఒకే జట్టు తరపున ఆడిన క్రికెటర్ కూడా కొహ్లీనే. దీనిలో 185 మ్యాచ్‌లు ఐపీఎల్‌లో ఆడగా.. 15 మ్యాచ్‌లు ఆర్సీబీ తరపున ఛాంపియన్స్ లీగ్‌లో ఆడాడు. కొహ్లీ తర్వాత జేమ్స్ హిల్డ్రెత్ (సోమర్‌సెట్ – 196), ఎంఎస్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్- 192), సమిత్ పటేల్ (నాటింగ్‌హామ్‌షైర్-191), సురేష్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్ – 188)లుగా ఉన్నారు.


Next Story

Most Viewed