- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, అంబర్ పేట్: సెల్ ఫోన్ రిపేర్ చేసే విషయంలో రౌడీషీటర్ ఓ మొబైల్ షాపు యజమాని పై ఇనుప రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాన్ పురాలో నివాసముండే ఆసిఫ్(23) నాంపల్లి హైటెక్ సెల్ ఫోన్ షాప్ నిర్వహిస్తున్నాడు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ ఉన్న సమీర్ (25) తన సెల్ ఫోన్ పాడైందని బాగు చేయించేందుకు గత మూడు రోజుల క్రితం హైటెక్ సెల్ ఫోన్ షాప్లో ఇచ్చాడు. అయితే సెల్ ఫోన్ బాగు చేసేందుకు సమయం పడుతుందని ఆసిఫ్ చెప్పగా సరేనన్న సమీర్ వెళ్లిపోయాడు.
మూడు రోజులు తర్వాత సమీర్ తన స్నేహితులైన మరో రౌడీషీటర్ అక్బర్ (26) మరో యువకుడు ఇమ్రాన్ (24) లతో కలిసి ఆదివారం రాత్రి ఫోన్ షాప్ నిర్వాహకుడు ఆసిఫ్ ఆదివారం అర్ధరాత్రి షాపు నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో యూసుఫియన్ దర్గా దాటిన తర్వాత అడ్డగించి ‘సెల్ ఫోన్ బాగు చేసేందుకు సమయం తీసుకుంటావా?’ అంటూ గొడవకు దిగారు. సెల్ ఫోన్ బాగు చేసేందుకు సమయం పడుతుందని చెప్పేందుకు ప్రయత్నించగా రౌడీ షీటర్ సమీర్ తనతో తెచ్చుకున్న పంచ్ (ఇనుప రాడు) తో ఆసిఫ్ ముఖం పై దాడి చేశాడు. మిగిలిన ఇద్దరు సైతం తీవ్రంగా కొట్టారు.
తీవ్ర గాయాలపాలైన బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యారు. ఆసిఫ్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇద్దరు రౌడీషీటర్లు సమీర్, అక్బర్ తో పాటు మరో యువకుడు ఇమ్రాన్ లపై హత్య యత్నం కేసు నమోదు చేసి నిందితులను కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.