- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెరిటేజ్ సూపర్ మార్కెట్లో కుళ్లిన పండ్లు.. అడిగిన కస్టమర్పై బెదిరింపులు
<p>దిశ, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో గల హెరిటేజ్ సూపర్ మార్కెట్లో కూలిపోయిన పండ్లను విక్రయిస్తున్నారు. శనివారం రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెంఫైమ రవి అనే వ్యక్తి సూపర్ మార్కెట్కు వచ్చి అరటిపండ్లను కొనడానికి చూడగా మొత్తం కుళ్లిపోయి కనిపించాయి. దాంతో ఆయన మార్కెట్లో ఆందోళన చేయగా సూపర్ మార్కెట్ వాళ్ళు బెదిరిస్తున్నారని రవి తెలిపాడు. ఎప్పుడో తీసుకువచ్చిన పండ్లను ప్రజలకు అంతగట్టడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యం క్షిణిస్తుందని, […]</p>

దిశ, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో గల హెరిటేజ్ సూపర్ మార్కెట్లో కూలిపోయిన పండ్లను విక్రయిస్తున్నారు. శనివారం రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెంఫైమ రవి అనే వ్యక్తి సూపర్ మార్కెట్కు వచ్చి అరటిపండ్లను కొనడానికి చూడగా మొత్తం కుళ్లిపోయి కనిపించాయి. దాంతో ఆయన మార్కెట్లో ఆందోళన చేయగా సూపర్ మార్కెట్ వాళ్ళు బెదిరిస్తున్నారని రవి తెలిపాడు.
ఎప్పుడో తీసుకువచ్చిన పండ్లను ప్రజలకు అంతగట్టడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యం క్షిణిస్తుందని, అసలే కరోనా మహమ్మరితో ఇబ్బందులు పడుతుంటే ఇమ్యూనిటీ కోసం పండ్లు తిందామని కొనుక్కోవడానికి వస్తే ఇలాంటి పండ్లు అమ్ముతున్నారని తెలిపారు. వెంటనే ఫుడ్ ఇన్ స్పెక్టర్ వచ్చి ఇక్కడ తనిఖీలు చేపట్టి ఇలాంటి షాపులను మూసివేయాలని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని నాణ్యమైన పండ్లు విక్రయించేలా చూడాలని కోరాడు.






