- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్కు తాను పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతున్నానని, తనలో ఎలాంటి లోపాలు లేవనే విషయాన్ని స్పష్టం చేయాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆడాడమీ (NAC)లో ఉంటున్నానని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ప్రస్తుతం బయట ఏం జరుగుతున్నదనే విషయంపై స్పష్టత లేదు.. కానీ నా ఆరోగ్యం విషయంపై నిత్యం బీసీసీఐతో చర్చలు జరుపుతున్నానని అన్నాడు. ‘ప్రస్తుతం తాను తొడ కండరాల గాయం నుంచి కోలుకున్నాను. ఫిట్నెస్ పెంచుకునేందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నాను. టెస్టు సిరీస్ కోసం బయల్దేరడాని కంటే ముందే పూర్తి ఫిట్నెస్ సాధించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయంలో నన్ను ఎవరూ వేలెత్తి చూపకూడదు. అందుకే ఎన్ఏసీలో కష్టపడుతున్నాను’ అని రోహిత్ చెప్పాడు. టెస్టు సిరీస్కు మరో నెల 25 రోజుల సమయం ఉండటంతో అప్పటి వరకు పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకొని ఫిట్నెస్ సాధించాలని అతడు భావిస్తున్నాడు.