రోహిణి కోర్టు కాల్పులు ఘటన: మహిళా లాయర్‌కు తీవ్ర గాయాలు!

by  |
Gangster Jitender
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో జరిగిన కాల్పుల ఘటనలో మహిళా లాయర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అయితే, గ్యాంగ్‌స్టర్ జితేందర్‌ను ఓ కేసు విషయంలో పోలీసులు శుక్రవారం రోహిణి కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు రూమ్ నెంబర్ 207 వద్ద కాల్పులు జరిపారు. దీంతో జితేందర్‌తో పాటు నలుగురు మృతిచెందారు. పోలీసులు కూడా దుండగులపై ఎదురు కాల్పులు జరిపారని, పోలీసులు, దుండగులు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఓ మహిళా లాయర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.


Next Story

Most Viewed