పాతబస్తీలో రెచ్చిపోతున్న పోకిరీలు

by  |

కరోనా మూలంగా దేశం మొత్తం లాక్‌డౌన్ విధించి జనాలు ఎవరూ బయటకు రాకుండా ఎంత కట్టడి చేసినా ఎక్కడో ఒకచోట పోకిరీలు బయటకు వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నామని రాష్ర్ట డీజీపీ మహేందర్ రెడ్డి పలుమార్లు చెప్పారు. దీంతో రోడ్ల మీదకు వచ్చిన వాహనాలు పోలీసులు వెంటనే సీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల పోకిరీలు పోలీసులపై ఎదురు తిరిగి దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో పోకిరీలు పోలీసులపై రౌడీల్లా ప్రవర్తిస్తూ, పోలీసులను భయబ్రాంతులకు గురిచేన్నారు. రోడ్లపైకి వస్తున్న ఆటోలను నియంత్రిస్తున్న పోలీసులపై దాడులు చేస్తున్నారు. తమనే ప్రశ్నిస్తారా అంటూ పోలీసులపైకి ఎదురుతిరుగున్నారు.

Tags : Rogues, road, violating, lockdown, rules, pathabastie,hyderabad,police

Next Story