ఎన్నాళ్ళీ అవస్థలు..?

by  |
ఎన్నాళ్ళీ అవస్థలు..?
X

దిశ, సంగారెడ్డి: వర్షాకాలం దృష్ట్యా ఇటీవల కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని కర్చల్ గ్రామం నుంచి మామిడిపల్లికి వెళ్ళే రహదారి జలమయం అయ్యింది. చాలా కాలంగా ఈ రహదారి గుంతలు పడి ఉన్న అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజు వందలాది మంది ప్రజలు ఈ దారిలో రాకపోకలు సాగిస్తున్నారు. మాకీ అవస్థలు ఇంకెన్నాళ్లు అంటూ స్థానికులు అంటున్నారు. అంతేగాకుండా ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలమయంగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేయాలని ఇరు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story