- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మక్తల్ : గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామ శివారులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఖానాపురం గ్రామానికి చెందిన సర్పంచ్ నర్సింహులు పొలానికి వెళ్తుండగా తమ గ్రామానికి చెందిన వ్యక్తి సోమప్ప(32) రోడ్డు ప్రమాదంలో చనిపోయి పడి ఉన్న ఘటన చూసి పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తుల కథనం మేరకు.. ఖానాపూర్ గ్రామానికి చెందిన సోము మాగనూరు మండలం అమ్మ పల్లి గ్రామానికి చెందిన బంధువుల పెళ్ళికి వెళ్లి సోమవారం మధ్య రాత్రి తిరిగి స్వగ్రమానికి వస్తుండగా హెచ్.పీ గ్యాస్ గోడౌన్ రోడ్డు మలుపు దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డు పక్కన చనిపోయి పడి ఉన్నాడు. అయితే అక్రమ ఇసుక ట్రాక్టర్ల కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చునని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.