మున్సిపల్ ట్రాక్టర్ ఢీ, ఒకరు మృతి

by  |
మున్సిపల్ ట్రాక్టర్ ఢీ, ఒకరు మృతి
X

దిశ, తాండూరు:
మున్సిపల్ ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలో మున్సిపాలిటీకి చెందిన ట్రాక్టర్ వెనుక వైపు నుంచి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాండూరు ఆస్పత్రికి తరలించారు. మృతుడు గిర్మాపూర్ గ్రామానికి చెందిన రామప్పగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story