కారు బోల్తా, సాధువులకు గాయాలు

by  |
కారు బోల్తా, సాధువులకు గాయాలు
X

దిశ, వెబ్‎డెస్క్ : ఉత్తరప్రదేశ్‎లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సాధువులు గాయపడ్డారు. కన్నౌజ్ జిల్లా అమోలర్ గ్రామంలో కారు టైరు పేలి డివైడర్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సాధువులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సాధువులు గంగా నదిలో స్నానం ఆచరించేందుకు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ గా వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. సాధువులకు వైద్యం అందించడంతో పాటు అన్ని రకాల సహాయం అందించాలని ఆధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed