చావులోను వీడని బంధం

by  |
చావులోను వీడని బంధం
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. షాబాద్ మండలంలోని వెంకమ్మ గూడ గ్రామానికి చెందిన బోడ లక్ష్మయ్య (70), బొడ చెన్నయ్య (55) ఇద్దరు అన్నదమ్ములు బైక్ పై శంషాబాద్‌కు వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం ఏవిధంగా జరిగింది అనేది తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed