శబరిమలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ వాసులుగా గుర్తింపు

by  |
roadaccident
X

దిశ, ఏపీ బ్యూరో : కేరళలోని శబరిమల సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన అయ్యప్ప స్వాములు టెంపోలో శబరిమలకు వెళ్లారు. శబరిమలకు 60 కి.మీ. దూరంలో టెంపో వాహనాన్ని నిలిపి.. టీ తాగేందుకు వెళ్లారు.

అదే సమయంలో వెనక నుంచి మరో వాహనం వచ్చి టెంపోను ఢీ కొట్టి.. భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు కర్నూలు పోలీసులకు సమాచారం తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Next Story

Most Viewed