రంగారెడ్డి జిల్లాలో భయానక రోడ్డు ప్రమాదం

by  |
రంగారెడ్డి జిల్లాలో భయానక రోడ్డు ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డు‌పై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ట్రక్ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రక్‌లో ఇరుక్కొన్న క్లీనర్‌కు తీవ్రగాయలు కాగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ట్రక్ శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed