ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

by  |
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం
X

దిశ రాజేంద్రనగర్ : కారులో అకస్మాత మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఇద్దరికి ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్లితే.. ఘట్కేసర్ నుంచి నరేష్, వరలక్ష్మి దంపతులు తమ విరిటో( AP 24 TV 1565) కారులో ఔటర్ రింగ్ రోడ్లపై గచ్చిబౌలి వైపు వెళుతుండగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పైకి రాగానే ఒక్కసారిగా వాళ్లు ప్రయాణిస్తున్న వెరిటో కారు నడుస్తుండగానే కారులో వంటలు చెలరేగాయి. గమనించిన భర్త నరేష్ కారు పక్కగా ఆపి కారులో ఉన్న ఇద్దరు దిగడంతో చూస్తుండగానే పూర్తిగా మంటల్లో కారు దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed