రీట్ పరీక్షరాయడానికి వెళ్లిన విద్యార్థులు.. అంతలోనే

by  |
రీట్ పరీక్షరాయడానికి వెళ్లిన విద్యార్థులు.. అంతలోనే
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజస్తాన్‌లోని జయపురలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. రీట్ పరీక్ష రాయడానికి ఆరుగురు విద్యార్థులు కలిసి ఒకే కారులో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఎదురుగా ఉన్న లారీని గమనించని డ్రైవర్ అతివేగంగా వెళ్లి లారీని ఢీ కొట్టారు. దీంతో ఐదుగురు విద్యార్థులతో సహా డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



Next Story