ఆ నలుగురు స్పాట్‌‌డెడ్.. కారణం అదే!

by Vadlamudi Anukaran |   (  Updated:2021-03-01 20:51:13  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు.. ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను ఢిల్లీకి చెందిన కాంచల్ సింగ్, మనోజ్ మిట్టల్, రేఖ, మహబూబ్ ఆలంగా పోలీసులు గుర్తించారు. వీరంతా కర్ణాటకలోని యశ్వంత్ పూర్ నుంచి [&hellip;]</p>

ఆ నలుగురు స్పాట్‌‌డెడ్.. కారణం అదే!
X

దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు.. ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను ఢిల్లీకి చెందిన కాంచల్ సింగ్, మనోజ్ మిట్టల్, రేఖ, మహబూబ్ ఆలంగా పోలీసులు గుర్తించారు. వీరంతా కర్ణాటకలోని యశ్వంత్ పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో ఉన్న నలుగురు మృతి చెందడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.

Next Story