పెద్ద అంబర్‌పేట వద్ద ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

by  |
పెద్ద అంబర్‌పేట వద్ద ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఆగి ఉన్న డీసీఎం, కారును మరో డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన హనుమంతరావు, రామయంద్రయ్యగా గుర్తించారు. పామిడిపాడు నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మ‌ృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed