ఆర్టీసీ బస్సు, ట్యాంకర్ ఢీ.. 15 మందికి గాయాలు

by  |
road accident news
X

దిశ,ఆర్మూర్: నిజామాబాడ్ జిల్లా, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం పెర్కిట్ ఫ్లెయ్ ఓవర్ బ్రిడ్జి సమీపంలోని దేవాలయం వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 25 మంది ప్రయాణికులతో కరీంనగర్ నగర్ నుండి నిజామాబాద్ కు వెళ్తుంది. పెర్కిట్ ఫ్లెయ్ ఓవర్ బ్రిడ్జి సమీపంలోని దేవాలయం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ ట్యాంకర్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పలువురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Next Story