- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,ఆర్మూర్: నిజామాబాడ్ జిల్లా, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం పెర్కిట్ ఫ్లెయ్ ఓవర్ బ్రిడ్జి సమీపంలోని దేవాలయం వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 25 మంది ప్రయాణికులతో కరీంనగర్ నగర్ నుండి నిజామాబాద్ కు వెళ్తుంది. పెర్కిట్ ఫ్లెయ్ ఓవర్ బ్రిడ్జి సమీపంలోని దేవాలయం వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ ట్యాంకర్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పలువురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Next Story