- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వాజేడు : చెట్టుకు టాటా మ్యాజిక్ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని ఏటూరు నాగారం మండల కేంద్రం నుంచి మంగపేట మండలం కమలాపూర్కు ప్రయాణికులతో కూడిన టాటా మ్యాజిక్ వెళ్తుండగా మార్గం మధ్య అడవిలో అతివేగంగా గాలులు వీచడంతో రహదారిపై పెద్ద వృక్ష పడిపోయింది. దీంతో టాటా మ్యాజిక్ కూలిన చెట్లు తప్పించబోయి మరో చెట్టుకు ఢీకొట్టడంతో వాహనంలో కూర్చున్న ప్రయాణికుడు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. విషయాన్ని తెలుసుకున్న ఏటూరునాగారం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి అక్కడికి చేరుకొని మృతి చెందిన వ్యక్తి చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. రహదారికి అడ్డంగా పడివున్న చెట్టుని జేసీబీ సాయంతో తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేశారు. గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డికి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.