బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

by  |
బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
X

దిశ, కాజీపేట: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం కాజీపేటలోని ఫాతిమా జంక్షన్ లో ముందు వెళ్తోన్న బైకును ఒక కారు ఢీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఫాతిమా జంక్షన్ నుంచి హనుమకొండ కు వెళుతున్న బైకును వెనుకనుంచి అతివేగంగా వస్తున్న ఒక కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.


Next Story

Most Viewed