హైదరాబాద్‌ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

by  |
road accident
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న వ్యాన్‌ను ఓ బైక్ ఢీ కొట్టిన ఘటన నగరంలోని దుండిగల్ పరిధిలోని బైరంపేట్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రమోద్ రెడ్డి, సైని రెడ్డిగా గుర్తింపు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed