చెట్టును ఢీకొన్న కారు.. ఒకరు మృతి

by  |
accident
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పి.గన్నవరం మండలం కందాలపాలెం వద్ద ఓ కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed