రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by  |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ పంప్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దోమల పెంట కు చెందిన కె.నాగభూషన్(22), భూత్పూర్ పిల్లగుట్ట తండాకు చెందిన రవిలు జడ్చర్ల అశోక్ లెలాండ్ షోరూంలో పని చేసేవారు. వీరిద్దరు కలిసి బైక్ పై మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర వైపు వస్తున్నారు. దేవరకద్ర నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నాగభూషణం అక్కడిక్కడే చనిపోగా రవికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags: Road accident in Devarkadra, One died, One seriously injured

Next Story

Most Viewed