స్టేషన్ ఘన్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

by  |
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్ గ్రామ శివారు శివరెడ్డి పల్లె క్రాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొని మీది కొండ గ్రామానికి చెందిన చిలువేరు రాజు (29) అక్కడికక్కడే మృతి చెందగా అతని తమ్ముడు రవి తీవ్రంగా గాయపడ్డారు.

గ్రామస్థుల కథనం ప్రకారం.. మీదికొండ గ్రామానికి చెందిన చిలువేరు రాజును అతని తమ్ముడు చిలువేరు రవి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో దించేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో చాగల్లు శివారు శివరెడ్డి పల్లి వద్ద ఘన్‌పూర్ వైపు వస్తున్న బైకును గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతి చెందగా రవి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రవిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాజుకు ఏడాది క్రితమే రెండవ పెళ్లి జరిగింది. భార్య నాలుగు నెలల గర్భవతి. మృతుడి తమ్ముడు రవికి మరో పది రోజుల్లో వివాహం జరిపేందుకు నిశ్చయించారు. ఆనందంగా పెళ్లి పనులు చేసుకోవాల్సిన ఇంటిలో విషాదం చోటుచేసుకుంది.

Next Story

Most Viewed