ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురు మృతి

by  |
ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. గజ్వేల్ నుండి వస్తున్న కారు శామీర్ పేట్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆగి ఉన్న కంటేనర్‌ను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న సంధ్య, సరళ అనే ఇద్దరు మహిళలతో పాటు కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు చిలుకానగర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కారులో గజ్వేల్ నుండి ఉప్పల్‌లోని చిలుకనగర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. కాగా మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.



Next Story

Most Viewed