బైకు, కారు ఢీ.. తల్లీకొడుకు మృతి

by  |
బైకు, కారు ఢీ.. తల్లీకొడుకు మృతి
X

దిశ, తుర్కయాంజల్: రంగారెడ్డి జిల్లా అదిబట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని రాగన్నగూడా వద్ద సాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న బైకును కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న తల్లీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతులు జీవీఆర్ కాలనీకి చెందిన సంరెడ్డి ప్రదీప్ రెడ్డి(19), సంరెడ్డి చంద్రకళ(48)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story