ఆటోను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

by  |
ఆటోను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
X

దిశ, ఖమ్మం రూరల్​ : ఖమ్మం రూరల్ మండలంలో ఆటోను కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలై ఆస్పత్రి పాలయ్యారు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీలక్ష్మి గాయాత్రి వెంచర్​దగ్గర వేగంగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. పక్కనే వెళ్తున్న టూవీలర్​ను సైతం తాకడంతో స్కూటర్ మీద పోతున్న కుటుంబానికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న రాములు కూడికాలు విరిగింది. మరో మహిళకు తలకు బలమైన గాయాలైయ్యాయి.

టూవీలర్​ పై ప్రయాణిస్తున్న భార్య, భర్త, ఇద్దరు పిల్లలకు స్వల్పగాయాలైయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ హస్పిటల్​కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ జక్కుల శంకర్​రావు తెలిపారు.



Next Story

Most Viewed