సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మంది ప్రయాణికులు..

by  |
సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మంది ప్రయాణికులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లాడ మండంలోని అంబేద్కర్ నగర్ వద్ద కొత్తగూడెం డిపోకు చెందిన టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

వివరాల ప్రకారం.. ఆదివారం 12.45 AMకు కొత్తగూడెం నుండి హైదరాబాద్ బయలుదేరిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు అంబేద్కర్ నగర్ వద్ద గుంతను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా.. 10 మంది గాయపడ్డారు. ప్రమాద స్థలానికి చేరుకున్న వైరా సీఐ. వసంత కుమార్ స్థానిక ఎస్ఐ, గ్రామస్తుల సాయంతో గాయపడిన వారిని 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed