విషాదం.. గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు స్పాట్ డెడ్

by  |
విషాదం.. గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు స్పాట్ డెడ్
X

దిశ, శేరిలింగంపల్లి : అతివేగం, అజాగ్రత్త ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. శనివారం తెల్లవారుజామున లింగంపల్లి నుండి గచ్చిబౌలి వైపు అతివేగంగా వెళుతున్న కారు ప్రమాదానికి గురైంది. విజయవాడకు చెందిన బ్యాంక్ ఉద్యోగి అబ్దుల్ రెహ్మాన్ వేగంగా కారు నడిపి గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని రేణుక ఎల్లమ్మతల్లి దేవాలయం ఎదుట ఉన్న చెట్టును ఢీ కొట్టాడు. దీంతో కారు రెండు భాగాలుగా విడిపోయింది.

కారులో ప్రయాణిస్తున్న కర్ణాటకకు చెందిన ఎం. మానస, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎస్.మానస, డ్రైవర్ అబ్దుల్ రెహ్మాన్ అక్కడికక్కడే మృతి చెందగా సిద్దు అనే జూనియర్ ఆర్టిస్ట్, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా అమీర్‌పేట్‌లో హాస్టల్‌లో ఉంటూ జూనియర్ ఆరిస్టులుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన కారుపై ఇప్పటికే ఓవర్ స్పీడ్‌కు సంబంధించి రూ. 14వేల చలాన్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed