దంపతులతోపాటు ఆ వ్యక్తి కూడా మృతి

by  |
దంపతులతోపాటు ఆ వ్యక్తి కూడా మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బత్తలపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ప్రధాన రహదారిపై తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన ఐదుగురు బొప్పాయి పండ్లను మార్కెట్‌లో అమ్మేందుకు ఆటోలో బత్తలపల్లికి వస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సూరి, ఆదమ్మ దంపతులు, చెన్నకేశవ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.

Next Story

Most Viewed