అధికారిక నివాసాన్ని కోవిడ్ సెంటర్‌గా మార్చిన తేజస్వీ యాదవ్

by  |
అధికారిక నివాసాన్ని కోవిడ్ సెంటర్‌గా మార్చిన తేజస్వీ యాదవ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్జేడీ యువనేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ తన వంతు సాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పాట్నాలోని తన అధికారిక నివాసాన్ని కోవిడ్ సెంటర్‌గా మార్చేశాడు. హాల్‌లో పడకలను ఏర్పాటు చేయడమే కాకుండా.. తగు మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులో ఉంచారు. కోవిడ్ సేవల కోసం తన అధికారిక నివాసాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చమని.. ప్రభుత్వం ఈ సెంటర్‌లో పేషెంట్లకు సేవ చేయాలని సూచించారు.

Next Story