మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

by  |
petrol
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై ( Petrol )25 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.97.52గా ఉండగా.. డీజిల్ ధర రూ.92.39గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.93.68గా ఉండగా.. డీజిల్ రూ.84.61గా ఉంది.

ఈ నెలలో పెట్రల్, డీజిల్ ధరలు పెరగడం ఇది 14వ సారి. ఈ నెలలో ఇప్పటివరకు పెట్రోల్‌పై రూ.3.33 పెరగ్గా.. డీజిల్‌పై రూ.4 వరకు పెరిగింది.

Petrol and diesel prices rise again

Next Story