భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

by  |
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
X

న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 9 ఏళ్ల గరిష్ట స్ధాయికి పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ఆల్‌టైం హైకి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 500 పెరిగి మొదటిసారిగా రూ .50,026కు చేరింది. వెండి కూడా ఒక్కరోజులోనే 3502 రూపాయలు పెరిగి రూ. 60,844కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరగడం, అమెరికన్‌ డాలర్‌ బలహీనపడటంతో యల్లోమెటల్‌కు గిరాకీ పెరిగింది. అంతేకాదు ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి అమెరికాలో మరో భారీ ప్యాకేజ్‌ ప్రకటిస్తారనే అంచనాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో హాట్‌మెటల్స్‌కు డిమాండ్‌ పెంచాయి. అయితే, సురక్షిత రిటన్స్‌ అందిస్తాయనే నమ్మకంతో మదుపరులు బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.

Next Story