నీట్‌ పరీక్షలో సత్తా చాటిన రిషి కాలేజీ విద్యార్ధులు.. మెచ్చుకున్న మంత్రులు, MLA

by  |
నీట్‌ పరీక్షలో సత్తా చాటిన రిషి కాలేజీ విద్యార్ధులు.. మెచ్చుకున్న మంత్రులు, MLA
X

దిశ, మహబూబ్ నగర్ : నీట్ ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులను సాధించిన రిషి మెడికల్, ఐఐటీ విద్యా సంస్థ నిర్వాహకులను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. గురువారం రిషి మెడికల్, ఐఐటీ అకాడమీ చైర్మన్ చంద్రకళ వెంకట్, సలహాదారు వెంకటయ్య, డీన్, ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో మెడికల్ ర్యాంకులు సాధించిన విద్యార్ధులను మంత్రులు అభినందించారు.

ర్యాంకులు సాధించిన వారిలో కౌశిక్, సుమోదా, సాయి వైష్ణవి, సానియా భాను నిఖాని, ప్రశాంత్ రెడ్డి, కళ్యాణ్, సాయి కిరణ్ రెడ్డి, అభిలాష్ గౌడ్, సిరి, ఆయేషా ఫాతిమా, కీర్తన బాలాజీ, లిఖిత, సభా తబస్సుమ్, రిషిత, చంద్రిక, సాయి కిరణ్ రెడ్డి, జయపాల్, అఖిల, అక్షయ్ కుమార్, పావని, భాను ప్రకాష్, ప్రత్యూష, సృజన ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ర్యాంకులు సాధించడమే కాదు. అత్యుత్తమ శిక్షణ పొంది ముందు ముందు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.


Next Story

Most Viewed