ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్

by  |
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ నియమించబడ్డాడు. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజం గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఈ సీజన్‌కు రిషబ్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు డీసీ సహయజమాని పార్ద్ జిందాల్ వెల్లడించారు. ‘శ్రేయస్ అయ్యర్ ఒక మంచి కెప్టెన్ అని మాకు తెలుసు. కానీ ఈ సంవత్సరం అతడి బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీ సేవలను మిస్ అవుతున్నాము. త్వరలోనే ఆయన మైదానంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నాము. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించగలిగే సత్తా రిషబ్ పంత్‌కు ఉన్నదని మేం భావిస్తున్నారు. ఆ పదవికి అతడే సరైన చాయిస్ అని అనుకుంటున్నాము. ఢిల్లీ జట్టుకు అతడు గతంలో అందించిన సేవలు మరువలేనివి. ఈ సారి మరింత పెద్ద బాధ్యత అతడిపై ఉన్నది. ఢిల్లీ క్యాపిటల్స్, రిషబ్‌పంత్‌కు బెస్టాఫ్ లక్’ అని జిందాల్ చెప్పారు. మరోవైపు పంత్ నియామకంపై శ్రేయస్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు. పంత్ నియామకం బెస్ట్ చాయిస్ అని చెప్పాడు.

Next Story

Most Viewed