జియో-బీపీ తొలి మొబిలిటీ స్టేషన్ ప్రారంభం!

by  |
petrol pump
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ జాయింట్ వెంచర్‌గా ప్రారంభమైన రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్(ఆర్‌బీఎంఎల్) మంగళవారం తన మొదటి జియో-బీపీ బ్రాండెడ్ మొబిలిటీ స్టేషన్‌ను నవీ ముంబైలో ప్రారంభించింది. ఈ స్టేషన్ ద్వారా వినియోగదారులకు పలు రకాల ఇంధనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మొబిలిటీ స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్, జనరల్ స్టోర్లు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. భవిష్యత్తులో ఇప్పుడున్న 1400 ఇంధన స్టేషన్లను జియో-బీపీ మొబిలిటీ కింద రీబ్రాండ్ చేయనున్నట్టు రిలయన్స్ సంస్థ తెలిపింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్లను కూడా ఈ మొబిలిటీ స్టేషన్లలో అందుబాటులో వస్తాయని పేర్కొంది.

దేశీయంగా ఇంధన, మొబిలిటీ మార్కెట్ శరవేగంగా పెరుగుతోందని, ఇకపై మరిన్ని సేవలను అందిస్తామని సంస్థ వివరించింది. మరో 20 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధనాల మార్కెట్‌గా భారత్‌ను నిలిపే లక్ష్యంతో ఉన్నామని తెలిపింది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లు పనిచేయనున్నాయి. భవిష్యత్తులో ఈ జాయింట్ వెంచర్ ద్వారా ప్రముఖ ఈవీ ఛార్జింగ్ మార్కెట్లో కీలకంగా మారేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ వెల్లడించింది.

Next Story

Most Viewed