- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఖండిస్తున్నారు నెటిజన్లు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు సైతం ఈ హింసాత్మక ఘటనపై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలో పాప్ సింగర్ రిహన్నా ఇన్స్టాగ్రామ్లో తన ఒపీనియన్ షేర్ చేసింది. ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య చెలరేగుతున్న హింస తన హృదయం ముక్కలయ్యేలా చేసిందని చెప్పింది. ఈ పరిస్థితిని చూడలేకపోతున్నానన్న రిహన్నా.. అమాయకమైన ఇజ్రాయెల్-పాలస్తీనా పిల్లలు బాంబ్ షెల్టర్లలో దాక్కోవడం బాధ కలిగించిందని చెప్పింది. కేవలం గాజాలోనే 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, ఇందులో 13 మంది చిన్నారులు ఉండటం మరింత ఆవేదనకు గురిచేస్తోందని చెప్పింది. దీనికి సరైన పరిష్కారం కావాలన్న రిహన్నా.. ఉగ్రవాదులు, ప్రభుత్వానికి మధ్య ప్రజలు నిరంతరం బలైపోతున్నారని ఈ పరిస్థితులు విచ్ఛిన్నం కావాలని సూచించారు.