రైస్ మిల్లర్స్ సంఘం రూ.50లక్షల విరాళం

by  |
రైస్ మిల్లర్స్ సంఘం రూ.50లక్షల విరాళం
X

దిశ, కరీంనగర్: కరోనాతో అల్లాడుతున్న తెలంగాణ సమాజ హితం కోసం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. ఈ వైరస్ ప్రబలకుండా నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు తమ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ద్వారా అసోసియేషన్ ప్రతినిధులు రూ.50 లక్షల చెక్కును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. కాగా, కరోనా మహమ్మారిని తరిమేందుకు చిన్నపిల్లల దగ్గరి నుంచి సెలెబ్రెటిలు, రాజకీయ నాయకులు విరాళాలు ప్రకటిస్తున్నారు.

Tags : corona, cmrf fund, rs 50 lacs, rice millers association



Next Story

Most Viewed