ప్రతి రేషన్‌కార్డుకి రూ.1500 ఇస్తాం

by Shyam |   (  Updated:2020-04-02 03:17:14  IST  )

<p>దిశ, వరంగల్: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుకు రూ. 1500 చొప్పున అందజేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిసి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం ఇస్తున్నామని, త్వరలో ఇంటికి రూ. 1500 చొప్పున అందజేస్తామని తెలిపారు. కరోనా మహమ్మారికి తరిమేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ‌ఈ [&hellip;]</p>

ప్రతి రేషన్‌కార్డుకి రూ.1500 ఇస్తాం
X

దిశ, వరంగల్: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుకు రూ. 1500 చొప్పున అందజేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిసి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం ఇస్తున్నామని, త్వరలో ఇంటికి రూ. 1500 చొప్పున అందజేస్తామని తెలిపారు. కరోనా మహమ్మారికి తరిమేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ‌ఈ కార్యక్రమంలో ఎంపీపీ లూనావత్ కమల పంతులు, జెడ్పిటిసి బానోత్ సింగ్ లాల్, సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.

tags;minister errabelly,warangal rural,rice distribution

Next Story