రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ

by  |
రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ
X

దిశ, దేవరకొండ: లంచం తీసుకుంటూ ఓ ఆర్‌ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని పీఏపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… పీఏపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన వెలుగురి వెంకట్ రెడ్డి అనే రైతు తనకున్న 17 గుంటల వ్యవసాయ భూమిని మ్యూటేషన్ చేయించుకోవడానికి తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకున్నాడు.

అర్జీని స్వీకరించిన ఆర్‌ఐ శ్యామ్ నాయక్ ఇదే అదునుగా భావించి, రైతు వద్ద నుంచి రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు వలపన్ని ఆర్ఐ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Next Story

Most Viewed