సుశాంత్ మరణం.. దిగజారిన రియా పరిస్థితి.. బాలీవుడ్‌ భయపడుతోందా?

by  |
ria and sushanth
X

దిశ, సినిమా : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో నిందితురాలిగా ఉన్న ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి అవకాశాలు ఇచ్చేందుకు బాలీవుడ్ భయపడుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ను శాసిస్తూ నెపోటిజంకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటి సినీ ప్రముఖులే రియాకు మద్దతుగా మాట్లాడేందుకు వెనుకాడగా.. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ కూడా తనకు సపోర్ట్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదని రుజువైంది. తనకు అవకాశమిస్తే తమ సినిమాను ప్రేక్షకులు ఆదరించరేమోనని, సినిమాను బాయ్‌కాట్ చేస్తారని భయపడుతున్నారు. ఈ క్రమంలో రియాకు కొత్తగా అవకాశం ఇవ్వడం కాదు కదా.. ఆల్రెడీ రియా ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పించేందుకు డిసైడ్ అయ్యారని ఓ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ద్వారా తెలుస్తోంది.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ, రియా చక్రవర్తి ప్రధానపాత్రల్లో రెండేళ్ల క్రితం ‘చెహ్రే’ మూవీని అనౌన్స్ చేసిన మేకర్స్.. జులై 2019లో ఈ సినిమా నుంచి రియా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ సుశాంత్ మర్డర్, డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను ప్రస్తుతం ఈ చిత్రానికి దూరంగా పెట్టేశారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినా.. ఈ మూవీ కాస్ట్ క్రెడిట్స్‌లో రియా పేరులేకపోవడం నిజంగానే మిస్టరీగా మారింది. అయితే ఇప్పుడు తన పేరు కాస్టింగ్‌లో ఇస్తే సుశాంత్ అభిమానులు ఆందోళనకు దిగుతారని అలా చేశారా? లేక నిజంగానే ప్రాజెక్ట్ నుంచి తప్పించారా? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్(ఏప్రిల్ 30) వరకు ఆగాల్సిందే. కాగా రుమీ జాఫ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది.


Next Story

Most Viewed