సుశాంత్ సోదరిపై కేసు పెట్టిన రియా

by  |
సుశాంత్ సోదరిపై కేసు పెట్టిన రియా
X

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ప్రియాంకపై రియా చక్రవర్తి కేసు నమోదు చేశారు. ముంబై పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ సృష్టించారంటూ, ఆ మందులను వాడిన ఐదు రోజులకే సుశాంత్ సింగ్ మరణించాడని పేర్కొంది. ఈ ఫిర్యాదులో రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన డా. తరుణ్ కుమార్ సహా ఇతరులపై కేసు నమోదు చేశారు.

సుశాంత్ మానసిక పరిస్థితి సరిగా లేక డిప్రెషన్‌కు గురైనట్టు సోదరికి ముందే తెలుసని, దాన్నుంచి బయటపడటానికి మందులు వాడాలని ఆమె సూచించినట్టు ఇటీవల లీక్ అయిన సుశాంత్ సోదరి ప్రియాంక చాట్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి. ప్రియాంకా సింగ్‌తో పాటు డా. తరుణ్ కుమార్‌లపై నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ యాక్ట్-1985 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ రియా చక్రవర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, సుశాంత్ కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాతే మందులను రాసిచ్చినట్టు డా. తరుణ్ కుమార్ తెలిపారు.


Next Story

Most Viewed